ట్రిపుల్ ఆర్‌లోకి.. పరిణీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకధీరుడు రాజవౌళి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్. రామ్‌చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఇప్పటికే ఓ షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేసుకుని రెండో షెడ్యూల్ పూణేలో జరుపుకుంటుంది. బాహుబలి తరువాత రాజవౌళి తెరకెక్కిస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దాదాపు 400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న సినిమాకు ఇప్పుడు హీరోయిన్ సమస్య వచ్చిపడింది. నిజానికి ఈ సినిమాలో హీరోయిన్లుగా బాలీవుడ్ భామ అలియాభట్‌ని, హాలీవుడ్ భామ డైసీలను ఎంపిక చేసాడు రాజవౌళి. అయితే ఆ సినిమాలో తాను నటించడం లేదని డైసీ ప్రకటించి తప్పుకుంది. దాంతో ఇప్పుడు రెండో హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలా? అన్న ఆలోచనలో భాగంగా రాజవౌళి ఇప్పటికే బాలీవుడ్ భామల శ్రద్ధకపూర్, జాహ్నవిలను సంప్రదించాడట. జాహ్నవికంటే శ్రద్ధకపూర్ అయితేనే బాగుంటుందన్న ఆలోచనతో ఆ దిశగా ప్రయత్నాలు చేసారు. ఈ విషయం గురించి చర్చలు జరిపిన శ్రద్ధకపూర్ కాస్త టైం కావాలని అడిగిందట. సరే అని టైం ఇచ్చారు. ఫైనల్‌గా శ్రద్ధ ఓకే చెబుతుందని అనుకుంటే ఇప్పుడు ఆమె ఈ సినిమాలో నటించే ఉద్దేశం లేదని చెప్పేసింది! తాను హిందీలో రెండు ప్రాజక్టులు ఒప్పుకున్నాను కనుక ట్రిపుల్ ఆర్‌కు డేట్స్ ఇవ్వలేనని చెప్పేసిందట. దాంతో ఇప్పుడు ఇంకెవరిని అడగాలా అన్న ఆలోచనలోపడ్డాడు జక్కన్న. తాజగా ఈ సినిమాకోసం పరిణీతి చోప్రా పేరు పరిశీలనకు వచ్చింది. పరిణీతి కూడా మంచి అవకాశం వస్తే తెలుగులో నటించేందుకు ఆసక్తి చూపిస్తుంది. ఈ నేపథ్యంలో పరిణీతి చోప్రాతో చర్చలు జరిపేందుకు సిద్ధమవుతున్నాడట దర్శకుడు. ట్రిపుల్ ఆర్ విషయంలో హీరోయిన్ సమస్య పరిణీతితో తీరిపోవచ్చు. ఎన్టీఆర్ సరసన పరిణీతి నటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.