ఖడ్గానికి సీక్వెల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈమధ్య కృష్ణవంశీ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. ఎన్నో ఆశలతో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా పరాజయంతో డీలాపడ్డ కృష్ణవంశీ అనుష్కతో రుద్రాక్ష అనే థ్రిల్లర్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. మరోవైపు బాలయ్యతో రైతు కథతో చిత్రం చేద్దామనుకున్నా వర్కవుట్ కాలేదు. దాంతో కృష్ణవంశీ మరో ప్లాన్‌లో వున్నాడు. శ్రీకాంత్, రవితేజలతో ఆయన రూపొందించిన ఖడ్గం అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో వున్నాడట. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్‌వర్క్ కూడా పూర్తికావచ్చిందని తెలిసింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తాడట. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రారంభంకానున్నట్లు సమాచారం.