ఖడ్గానికి సీక్వెల్?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 22 April 2016
ఈమధ్య కృష్ణవంశీ ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయి. ఎన్నో ఆశలతో చేసిన ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమా పరాజయంతో డీలాపడ్డ కృష్ణవంశీ అనుష్కతో రుద్రాక్ష అనే థ్రిల్లర్ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా చర్చల దశలోనే ఆగిపోయింది. మరోవైపు బాలయ్యతో రైతు కథతో చిత్రం చేద్దామనుకున్నా వర్కవుట్ కాలేదు. దాంతో కృష్ణవంశీ మరో ప్లాన్లో వున్నాడు. శ్రీకాంత్, రవితేజలతో ఆయన రూపొందించిన ఖడ్గం అప్పట్లో సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇపుడు ఈ చిత్రానికి సీక్వెల్ చేసే పనిలో వున్నాడట. ఇప్పటికే దానికి సంబంధించిన స్క్రిప్ట్వర్క్ కూడా పూర్తికావచ్చిందని తెలిసింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తాడట. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రారంభంకానున్నట్లు సమాచారం.