15న.. రాగల 24 గంటల్లో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టైటిల్‌తోనే వైవిధ్యమైన చిత్రంగా పేరు తెచ్చుకుంది -రాగల 24గంటల్లో. శ్రీనివాస్ కానూరు నిర్మాతగా ఢమరుకం డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెరకెక్కిస్తున్నాడు. ఈషా రెబ్బ, సత్యదేవ్, గణేశ్ వెంకట్రామన్, ముస్కార్ సేథీ, శ్రీరామ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ అధికారికంగా వెల్లడించారు. రాగల 24 గంటల్లో చిత్రం నవంబర్ 15న థియేటర్లకు రానుందట. ఇంట్రెస్టింగ్ టైటిల్‌తోనే మంచి మార్కులు కొట్టేసిన సినిమా, టీజర్‌తో మరింతగా అంచనాలు పెంచింది. ఈషా రెబ్బ పాత్రతోనే కథ నడుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. గ్లామర్‌పరంగా, నటనపరంగా ఈషాకి మంచి క్రేజే ఉంది. అయితే, సరైన బ్రేక్ ఆమెకు రాలేదనే చెప్పాలి. కొత్త ప్రాజెక్టైనా కెరీర్‌ని మరో మెట్టు ఎక్కించవచ్చన్న నమ్మకంతో ఉంది. ఆమె నమ్మకాన్ని సినిమా ఎంతవరకు నిలబెడుతుందో చూడాలి.