జాతీయ వార్తలు

‘మహా క్లీనథాన్‌’ లో ఫడణవిస్‌, అమితాబ్‌

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: స్వచ్ఛభారత్‌లో భాగంగా ముంబయిలో శనివారం ఏర్పాటుచేసిన ‘మహా క్లీనథాన్‌’ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్‌, బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొన్నారు. స్వయంగా చీపురు చేతబట్టిన ఫడణవిస్‌, అమితాబ్‌లు జేజే ఆసుపత్రి ప్రాంగణం, అక్కడి పరిసరాలను శుభ్రం చేశారు. అక్టోబర్‌ 2 మహాత్మాగాంధీ జయంతి నాటికి రాష్ట్రంలో 50 స్వచ్ఛ నగరాలను తీర్చిదిద్దుతామని ఫడణవిస్‌ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ 10 గజాలు శుభ్రం చేసుకుంటే పూర్తి నగరం పరిశుభ్రమవుతుందని అమితాబ్‌ అన్నారు.