జాతీయ వార్తలు

మథురలో సిఎం అఖిలేష్ పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: మథుర పట్టణంలో ఇటీవల హింసాకాండ చోటుచేసుకున్న ప్రాంతంలో యుపి సిఎం అఖిలేష్ యాదవ్ సోమవారం పర్యటించారు. మథురలోని జవహర్‌బాగ్ పార్కును ఆక్రమించుకున్న వారిని ఖాళీ చేయించేందుకు పోలీసులు ప్రయత్నించగా జరిగిన అల్లర్లలో ఇద్దరు పోలీసు అధికారులు సహా 29 మంది మరణించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో శాంతిభద్రతలు మృగ్యమైపోయాయని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పించడంతో అఖిలేష్ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది యుపి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఇలాంటి హింసాత్మక ఘటనలు ప్రభుత్వ ప్రతిష్టకు మచ్చతెస్తున్నాయని గ్రహించి అఖిలేష్ మథురలో పర్యటించారు. అల్లర్ల తర్వాత మథుర కలెక్టర్, ఎస్పీని ఆయన బదిలీ చేశారు.