ఆంధ్రప్రదేశ్‌

కూలీలతో కలిసి పనిచేసిన చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ: తెలంగాణ నుంచి ఎపిలో విలీనమైన మండలాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా బుధవారం పర్యటించి గిరిజనులను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. చింతూరులో ఆయన అంగన్‌వాడీ కేంద్రాన్ని, ఉపాధి హామీ పథకం పనులను పరిశీలించారు. కూలీలతో కలిసి మట్టితట్టలను తలపైకి ఎత్తుకున్నారు. సబ్-ట్రెజరీ ఆఫీసును ప్రారంభించాక, గ్రామంలో పెట్రోల్ బంకు, ఎల్‌పిజి సిలిండర్ల గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గిరిజన మహిళలను ప్రశించి వారి జీవన పరిస్థితులను తెలుసుకున్నారు. మావోయిస్టుల ప్రభావం ఉన్న చింతూరు మండలంలో సిఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.