రాష్ట్రీయం
తిరుమల వెంకన్నకు సిఎం మొక్కులపై కమిటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 11 December 2015
హైదరాబాద్, డిసెంబర్ 10: తిరుమల వెంకన్నకు ముఖ్యమంత్రి కెసిఆర్ చెల్లించుకోవలసిన మొక్కుబడులపై త్రిసభ్య కమిటీ ఏర్పాటైంది. ఉద్యమ కాలంలో తెలంగాణ ఏర్పాటును కోరుకుంటూ వెంకన్నకు మొక్కుకున్నట్టు, స్వప్నం సాకారమైన నేపథ్యంలో త్వరలో మొక్కులు తీర్చనున్నట్టు గతంలో ముఖ్యమంత్రి ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల వేంకటేశ్వరస్వామికి బంగారు ఆభరణాల మొక్కుల చెల్లింపుకోసం ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం నియమించింది. ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, దేవాదాయశాఖాధికారి భాస్కర్, సమన్వయకర్తగా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ రాజేశ్వర్ వ్యవహరిస్తారు. 5.59 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుమల వెంకన్నకు సమర్పించనున్నారు.