రంగారెడ్డి

గెలిచేవారికే కార్పొరేటర్ టికెట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శేరిలింగంపల్లి, డిసెంబర్ 18: గ్రేటర్ ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని, సిఎం కెసిఆర్ ఆదేశాలను ప్రతి కార్యకర్త పాటించాలని గ్రేటర్ టిఆర్‌ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు స్పష్టం చేసారు. శుక్రవారం మదీనాగూడలో నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ మినీ ఇండియా లాంటిదని, ఇక్కడ అన్ని ప్రాంతాలు, మతాలవారు నివసిస్తున్నారని, అందరినీ కడుపులో పెట్టుకుని చూసుకుంటామని సిఎం చెప్పారని గుర్తు చేసారు. అయితే గ్రేటర్ ఎన్నికల్లో గెలిచే సత్తా వున్నవారికే టికెట్ ఇస్తామని, అందరూ కలిసికట్టుగా పనిచేసి మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని పిలుపునిచ్చారు. ఉద్యమకారులకు సముచితస్థానం దక్కుతుందని, ఎవరూ నిరుత్సాహ పడవద్దని భరోసా ఇచ్చారు. సీనియర్ నేత కె.శంకర్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నేతలు కపిల్‌రాజ్, ఎం.సత్యనారాయణ, నాగేందర్ యాదవ్, విజయ్‌రెడ్డి, డివిజన్‌ల అధ్యక్షులు, మహిళా నేతలు పాల్గొన్నారు.