క్రైమ్/లీగల్

అగ్ని ప్రమాదంలో దివ్యాంగుడు సజీవ దహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చల్లపల్లి, జనవరి 21: అగ్ని ప్రమాదంలో ఓ దివ్యాంగుడు సజీవ దహనమైన విషాద సంఘటన ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో సోమవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులతో పాటు చూపర్లను కలచి వేసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన దివ్యాంగుడు హసన్ బేగ్ (55) ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. సోమవారం రాత్రి 11గంటల సమయంలో తన ఇంట్లో నిద్రిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన స్థానికులు అదుపు చేసే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. మంట్లో చిక్కుకుని హసన్ బేగ్ కాలి బూడిదైపోయాడు. లారీ క్లీనర్‌గా పనిచేస్తూ 1993 సంవత్సరంలో జరిగిన ఓ ప్రమాదంలో హసన్ బేగ్ కాళ్లు చచ్చుబడి పోయి దివ్యాంగుడిగా మారాడు. అప్పటి నుండి ఒంటరిగానే జీవిస్తున్నాడు. దుర్భర పరిస్థితులను అనుభవిస్తున్న హసన్ బేగ్ అగ్నికి ఆహుతై మృతి చెందటం పట్ల స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదంలో హసన్ బేగ్ చిక్కుకున్నాడన్న సమాచారం తెలుసుకున్న ఘంటసాల ఎస్‌ఐ రామకృష్ణ హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయ చర్యలను ముమ్మరం చేశారు. అప్పటికే మృతి చెందటంతో ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.