క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
కీసర, జనవరి 26: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం చత్తీస్ఘడ్కు చెందిన సురేశ్ మోదీ కన్స్ట్రక్షన్లో విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం ద్విచక్రవాహనంపై భార్య రజిని, కుమారులు రాధికాంత్, సాగర్, ఉదయ్తో కలిసి ద్విచక్ర వాహనంపై కుషాయిగూడ వైపు వెళుతున్నాడు. నాగారం ఐకాం కంపెనీ వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి ప్రక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో సురేశ్ (25) తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈమేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.