క్రైమ్/లీగల్

ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనత్‌నగర్, జనవరి 27: ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి మృతిచెందిన సంఘటన సంజీవరెడ్డినగర్ (ఎస్సార్‌నగర్) పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్బీనగర్‌కు చెందిన సాయి దీపీక రెడ్డి(24) జూబ్లీహిల్స్‌లోని అపర్ణ ఎంటర్‌ప్రైజెస్ సంస్థలో విధులు నిర్వహిస్తుంది. ఎల్బీనగర్ నుంచి నిత్యం జూబ్లీహిల్స్‌కు ద్విచక్ర వాహనంపై రావడం ఇబ్బందిగా ఉండటంతో కొంత కాలంగా సనత్‌నగర్‌లోని తన స్నేహితుల వద్ద ఉంటుంది. రోజులాగే విధులకు హాజరయ్యేందుకు బయలుదేరిన సాయి దీపిక యూసఫ్‌గూడ రహదారిపై ప్రయాణిస్తుండగా సికింద్రాబాద్ నుంచి కొండపూర్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన దీపిక అక్కడికక్కడే మృతిచెందింది. ప్రమాదానికి కారణమైన బస్సును స్వాధీనం చేసుకొని, డ్రైవర్‌ను అదుపులోనికి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూల్, కార్యాలయాలకు వెళ్లే సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో యూసఫ్‌గూడ రహదారిపై ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.