క్రైమ్/లీగల్

ఆటోను ఢీకొన్న లోకమాన్య ఎక్స్‌ప్రెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాచేపల్లి, సెప్టెంబర్ 24: గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి రైల్వే జంక్షన్ సమీపంలోని పులిపాడు గేట్ వద్ద అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న ఆటోను లోక్‌మాన్య ఎక్స్‌ప్రెస్ సోమవారం ఢీకొంది. రైలు వస్తున్న విషయాన్ని గమనించిన ఆటోడ్రైవర్ ఆటో పట్టాల మీద వదలి పరారయ్యాడు. ఈ ఘటనతో అరగంటపాటు రైలు పట్టాలపై నిలిచిపోయింది. వివరాల లోనికి వెళితే కాకినాడ నుండి ముంబై వెళ్ళే లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ నడికుడి జంక్షన్ మీదగా హైదరాబాద్ వెళుతోంది. ఈ నేపథ్యంలో పులిపాడు వైపు నుండి అక్రమ బియ్యాన్ని తరలిస్తున్న ఆటో రైల్వేగేటు వద్ద పట్టాలపై అకస్మాత్తుగా ఆగిపోయింది. రైలు వస్తున్న విషయాన్ని గమనించిన ఆటోడ్రైవర్ ఆటో నుండి దూకి పరారయ్యాడు. సంఘటన విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు హుటాహుటిన సంఘటనా ప్రాంతానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి రేషన్ బియ్యం విషయమై రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు.