క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దిపాడు, అక్టోబర్ 1 : జాతీయ రహదారిపై వెంకట రాజుపాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో ఆదివారం అర్థరాత్రి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం మండల పరిధిలోని వెంకటరాజుపాలెం గ్రామానికి చెందిన తిరగాబత్తిన అనీల్‌కుమార్ (30) ఒంగోలు నుండి తన స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వ్యతిరేక మార్గంలో వస్తుండగా గుంటూరు నుండి ఒంగోలు వైపు వెళుతున్న ఓ ట్రాలీ ఆటో అతి వేగంగా అనీల్‌ను ఢీకొట్టడంతో అనీల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని 108 ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. రిమ్స్ నుండి వచ్చిన సమాచారం మేరకు స్థానిక ఎస్‌ఐ సురేష్ కేసు దర్యాప్తు చేపట్టారు.

మద్యం మత్తులో డ్రైవర్ వీరంగం
మద్దిపాడు, అక్టోబర్ 1 : మద్యం మత్తులో లారీ డ్రైవర్ జాతీయ రహదారిపై నిర్లక్ష్యంగా లారీని నడుపుతూ మూడు ద్విచక్రవాహనాలను ఢీకొట్టిన ఘటన మండల పరిధిలోని వెంకటరాజుపాలెం నుండి ఏడుగుండ్లపాడు గ్రామాల మధ్య జరిగింది. స్థానికుల సమాచారం మేరకు మేదరమెట్ల నుండి ఒంగోలు వైపు వెళుతున్న లారీ డ్రైవర్ మద్యం సేవించి తను ఇష్టానుసారంగా లారీని నడిపాడు. ఈ నేపధ్యంలో వెంకటరాజుపాలెం వద్ద ముందు వెళుతున్న ఢీకొట్టి వెళ్లాడు. మరలా ఏడుగుండ్లపాడుకు సమీపంలో మరో రెండు ద్విచక్రవాహనాలను ఢీకొట్టాడు. దీంతో ద్విచక్ర వాహనాలపై ఉన్న ఐదుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు క్షతగాత్రులను 108 ద్వారా ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. లారీ డ్రైవర్‌ను లారీని ఆటో నగర్‌లో ఉంచి మద్యం ఎక్కువగా సేవించి ఉండటం వలన రోడ్డుపై పడి ఉన్నాడు. హైవే పెట్రోలింగ్ వారు లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్‌లో అప్పగించారు.

ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి
సంతమాగులూరు, అక్టోబర్ 1: గ్రానైట్ క్వారీనుండి పాలిషింగ్ ఫ్యాక్టరీకి కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో ఒకరు మృతి చెందగా ఒకరికి గాయాలైన సంఘటన బల్లికురవ మండలం చెన్నుపల్లి బల్లికురవ గ్రామాల మద్య సోమవారం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రానైట్ కార్మికుడు మహారాష్టక్రు చెందిన అర్జున్ ప్రతాప్(19) మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. వివరాలలోకి వెళితే...బల్లికురవ మండలం వేమవరం గ్రామం పరిధిలో గ్రానైట్ పాలిషింగ్ పరిశ్రమ ఉన్న యజమానికి సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం కొండ వద్ద గ్రానైట్ క్వారీ ఉంది. పాలిషింగ్ పరిశ్రమలో సాంకేతిక లోపం రావడంతో సంతమాగులూరు మండలం మక్కెనవారిపాలెం క్వారీలో పనిచేస్తున్న కార్మికులు పాలిషింగ్ యూనిట్ మరమ్మత్తులకై ట్రాక్టర్ పై బయలు దేరారు. అయితే ట్రాక్టర్ చెన్పుల్లి దాటి బల్లికురవ చేరుకునే లోపై డ్రైవర్ అదుపుతప్పి బోల్తాకొట్టడంతో ట్రాక్టర్ డ్రైవర్ ప్రక్కన కూర్చుని ఉన్న అరుజన్ ప్రాతాప్ అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తికి గాయాలు కాగా క్షతగాత్రును చిలకలూరిపేట వైద్యశాలకు తరలించినట్లు బల్లికురవ ఎసై వై.నాగరాజుల తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన కార్మికుని మృతదేహనికి పంచనామా చేసి పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తుచేస్తున్నట్లు తెలిపారు.