క్రైమ్/లీగల్

మూడిళ్లల్లో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్మూర్, అక్టోబర్ 29: ఆర్మూర్ పట్టణంలోని రాజారాంనగర్ కాలనీలో గల పూసల వీధిలో ఉండే మూడు ఇళ్ల తాళాలు పగులగొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన సోమవారం వెలుగు చూసింది. తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, ఆరున్నర తులాల వెండితో పాటు నగదును దొంగిలించినట్లు బాధితులు సోమవారం తెలిపారు. రాజారాంనగర్‌లోని సిత్తార శేఖర్ ఇంటికితాళం వేసి ఊరికి వెళ్లడంతో దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువాను పగులగొట్టి రెండు తులాల బంగారు చైన్, అరతులం బుట్ట కమ్మలు, అరతులం బంగారం, ఆరున్నర తులాల వెండి పట్ట గొలుసులు, పది వేల నగదును దొంగిలించారు. అలాగే షాబాజ్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరికె ళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండడాన్ని గమనించిన దొంగలు ఆ ఇంటి తాళాన్ని పగులగొట్టి ఇంట్లోకి ప్రవేశించి బీరువాను ధ్వంసం చేసి 10 వేల నగదు, చీరలను దొంగిలించారు. అదే వీధికి చెందిన షేక్ మహబూబ్ ఇంటి తాళాన్ని పగులగొట్టి ఇంట్లోని బీరువాను ధ్వంసం చేసి ఆరు తులాల బంగారు ఆభరణాలు, 21 వేల నగదును ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం చుట్టు పక్కల వారు దొంగతనం జరిగిన విషయాన్ని గమనించి ఆయా ఇళ్లల్లో నివాసం ఉండే వారికి ఫోన్ చేసి చెప్పడంతో వారంతా వచ్చారు. దొంగతనం విషయమై పోలీసులకు ఫిర్యాదులు చేసినట్లు పోలీసులు తెలిపారు.