క్రైమ్/లీగల్

ఇద్దరు కుమార్తెలతో బాధిత మహిళ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజువాక అంబేద్కర్ కాలనీలో తన ఇంటి స్థలాన్ని కబ్జా చేసిన రిటైర్డ్ పోలీసు నుంచి స్థలం ఇప్పించాలంటూ మహిళ హల్‌చల్ చేసింది. ఇదే విషయమై రెండు నెలల కిందట కలెక్టరేట్‌లో సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేసిన మహిళ ఉసిలి లక్ష్మి తాజాగా తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రజావాణికి వచ్చింది. ఈ సారి పురుగుల మందు చేతపట్టుకుని తనకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. గతంలో కలెక్టర్ హామీ ఇచ్చినప్పటికీ మల్కాపురం పోలీసులు న్యాయం చేయలేదని ఆరోపించింది. అయితే పోలీసులు ముందస్తుగా స్పందించి లక్ష్మి చేతిలోని పురుగుల మందు సీసాను స్వాదీనం చేసుకున్నారు. .

నేటి నుంచి పైవంతవపై రాకపోకలు నిలిపివేత

జగదాంబ, నవంబర్ 5: జీవీ ఎంసీ పరిధిలోని వేమన మందిరం కూడలి నుంచి రైల్వేస్టేషన్ వరకు గల పైవంతన రోడ్డు మరమ్మత్తులు, నిర్మాణం జరుగుతున్న కారణంగా ఈ నెల 6నుంచి తాత్కాలికంగా రాకపోకలు నిలిపివేస్తున్నట్లు కమిషనర్ హరినారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు. నగర ప్రజలంతా ఈ విషయాన్ని గమనించి జీవీ ఎంసీకి సహకరించాలన్నారు.