క్రైమ్/లీగల్

చోరీ కేసులో ఒకరి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూన్ 8: బోడుప్పల్, మేడిపల్లి పరిధిలో దొంగతనాలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న పేరుమోసిన వ్యక్తిని మల్కాజిగిరి సీసీఎస్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అతని వద్ద రూ.7లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకుని శుక్రవారం కోర్టుకు రిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళితే.. పీర్జాదిగూడ చెన్నారెడ్డి ఎన్‌క్లేవ్‌లో నివసిస్తున్న రాజస్థాన్‌కు చెందిన ప్రజాపత్ సురేష్ (40) డ్రైవర్. అతడు 1996లో రాజస్థాన్ నుంచి హైదరాబాద్‌కు వచ్చాడు. వివిధ ప్రాంతాలలో స్వీట్ దుకాణం నడిపి నష్టం వచ్చిందని బ్యాడ్ హాబిట్స్‌కు అలవాటు పడ్డాడు. తాగుతూ జులాయిగా తిరుగుతూ కష్టం చేతగాక చోరీలకు అలవాటు పడ్డాడు. పగలంతా తిరుగుతూ రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తున్నాడు. ఆరు కేసుల్లో నిందితుడిగా ఉన్న సురేష్ తప్పించుకు తిరుగుతున్నాడు. అందిన సమాచారం మేరకు దొంగతనం చేయడానికి ప్రయత్నిస్తుండగా సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ లింగయ్య ఆధ్వర్యంలో సిబ్బంది పట్టుకుని విచారించగా దొంగతనం గుట్టు రట్టయింది.