క్రైమ్/లీగల్
బోగీల మధ్య నలిగి రైల్వే కార్మికుని మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 10 June 2018
ఇబ్రహీంపట్నం, జూన్ 9: గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపులో రెండు బోగీల మధ్య సెంట్రింగ్లో నలిగి కార్మికుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన శనివారం జరిగింది. రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం గుంటుపల్లి రైల్వే వ్యాగన్ వర్క్షాపులో పనిచేస్తున్న మాధవరావు(51) శనివారం ఉదయం విధులకు వెళ్లాడు. 5వ వే వద్ద రెండు వ్యాగన్ల సెంట్రింగ్ మధ్య నలిగి అక్కడిక్కడే మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి ఇబ్రహీంపట్నం పోలీసులకు బదిలీ చేశారు. మృతదేహాన్ని శవ పరీక్ష కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.