క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో భార్యా భర్తలు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు: జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరం పోలీసు శిక్షణా కేంద్రం సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో భార్యభర్తల మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని టిప్పర్ ఢీ కొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకొంది. ప్రశాంత్‌నగర్ కాలనీకి చెందిన తులసీరాం(42) లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం సాయంత్రం తులసీరాం తన భార్య సుగుణ(35) కలసి పలమనేరులో ఉన్న తండ్రిని చూసేందుకు బుల్లెట్‌లో బయలు దేరారు. జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రం ఎదుట హైవే రోడ్డు పనులు చేస్తున్న టిప్పర్ వీరు వెళ్తున్న బుల్లెట్‌ను ఢీకొంది. తులసీరాం అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడిన సుగుణను స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికి ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. చిత్తూరు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీరికి పిల్లలు లేరు. తమ యోగక్షేమాలు చూస్తున్న కుమారుడు మృతి చెందడాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. ప్రశాంత్‌నగర్‌లో అందరితో అప్యాయంగా ఉండే తులసీరాం అకాలంగా మరణించడంతో కాలనీ వాసులు శోసంద్రంలో మునిగిపోయారు.