క్రైమ్/లీగల్

కారు-బస్సు ఢీ: ఐదుగురి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బళ్ళారి, జూన్ 15: కర్నాటకలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బళ్ళారి తాలూకా కోళూరుక్రాస్ వద్ద శుక్రవారం సాయంత్రం సిరుగుప్ప నుంచి వస్తున్న కేఎస్‌ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన ఇండికా కారును ఢీ కొంది. దీంతో కారులో ఉన్న సంతోష్(35), అతని కుమారుడు ప్రీతం(8), కృష్ణ(22), వినయ్(25), దాదాఖలందర్(23) అక్కడికక్కడే మృతి చెందారు. బళ్ళారి జిల్లా కురుగోడుకు చెందిన వీరు బళ్ళారికి వస్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. నిత్యం రద్దీగా ఉండే సిరుగుప్ప రోడ్డులో ప్రమాదం చోటు చేసుకోవడంతో బళ్ళారి సిరుగుప్ప మధ్య రాకపోకలకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న మృతుల బంధువులు సంఘటనాస్థలానికి చేరుకుని భోరున విలపించారు. కురుగోడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.