క్రైమ్/లీగల్

ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), జూన్ 15: గత కొంత కాలంగా ద్విచక్ర వాహనాలను దొంగిలిస్తున్న దొంగలను ఆర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు చేసిన నిందితుడిని శుక్రవారం స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ మహ్మద్ బాషా మీడియా ముందు హాజరు పరిచారు. నిందితుడిని అపహరణకు గురైన ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ మహ్మద్ బాషా మీడియాకు వివరించారు. గుడ్లవల్లేరు మండలం ఉలవపూడి గ్రామానికి చెందిన పడమట చింతయ్య అనే వ్యక్తి గత జూన్ నెల 10వతేదీన స్థానిక ఆర్టీసీ కాలనీకి చెందిన మెరుగు సంజీవరావు తన ద్విచక్ర వాహనాన్ని సామాస్ వస్త్ర దుకాణం వద్ద పార్కింగ్ చేశాడు. కొద్దిసేపటికి చూడగా బైక్ అపహరణకు గురైంది. దీనిపై ఆర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో చింతయ్య చోరీకి పాల్పడినట్లు గుర్తించి విచారించగా పలు ప్రాంతాల్లో ఏడు ద్విచక్ర వాహనాలు దొంగిలించినట్లు గుర్తించామన్నారు. నిందితుడిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ వాసవి, ఎస్‌ఐలు హబీబ్ బాషా, గుర్రం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.