క్రైమ్/లీగల్
గౌరీలంకేశ్ హత్య కేసులో రాకేష్ మత్కు సమన్లు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 17 June 2018
బెంగళూరు, జూన్ 16: జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్య కేసులో విజయపురా జిల్లా శ్రీరామసేన అధ్యక్షుడు రాకేష్ మత్ను విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసినట్లు సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. ఈ కేసులో హిందూత్వ సంస్థకు చెందిన పరుశురా వాగ్మేర్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తుకు రాష్ట్రప్రభుత్వం సిట్ను ఏర్పాటు చేసిన సంగతి విదితమే. గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన జర్నలిస్టు లంకేష్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి విదితమే. కాగా ఈ హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న రాకేష్ మత్, వాగ్మేర్తో తమకు సంబంధంలేదని శ్రీరామసేన రాష్ట్ర అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ తెలిపారు. వాగ్మేర్తో శ్రీరామసేనకు సంబంధం లేదన్నారు.