క్రైమ్/లీగల్

సముద్రంలో మునిగి యువకుడు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగరాయకొండ, జూన్ 17: మండల పరిధిలోని పాకల సముద్ర తీరంలో ముగ్గురు యువకులు సరదాగా స్నానానికి వెళ్లగా వారిలో ఒక యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు బింగినిపల్లికి చెందిన కోటేశ్వరరావు (18) తన స్నేహితులైన మరో ఇద్దరితో కలిసి పాకల సముద్రతీరంలో సరదాగా స్నానానికి వెళ్లారు. పెద్దపెద్ద అలల తాకిడికి కోటేశ్వరరావు సముద్రంలో కొట్టుకుపోయాడు. పరిస్థితిని గమనించిన తోటిమిత్రులు పెద్దగా కేకలు వేయడంతో మత్స్యకారులు సముద్రంలోకి దూకి కోటేశ్వరరావును బయటకు తీశారు. అయితే అప్పటికే కోటేశ్వరరావు మృతిచెందాడు. సమాచారం అందుకున్న సింగరాయకొండ ఎస్‌ఐ నాగమల్లేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని కోటేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.