క్రైమ్/లీగల్

నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూర్, జూన్ 19: మండలంలోని బోయపల్లి గ్రామంలో మంగళవారం నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని, ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు తాండూర్ ఎస్‌ఐ రవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా వంటవారిపాలెంకు చెందిన పుట్ట శ్రీనివాస్, బెల్లంపల్లి మండలం గోండుగూడెం చెందిన కుర్సింగ అంబరావులు బోయపల్లిలో నకిలీ పత్తి విత్తనాలు విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా పట్టుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి సుమారు రూ.3లక్షలు విలువ చేసే 1.50 క్వింటాళ్ల పత్తి విత్తనాలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు రిమాండ్‌కు తరలించడం జరిగిందని ఎస్‌ఐ పేర్కొన్నారు.