క్రైమ్/లీగల్

ఈతకెళ్లి ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉరవకొండ, జూన్ 21 : ఈతకెళ్లి ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం పెన్నోబిలం సమీపంలోని ఏటి గంగమ్మ ఆలయం వద్ద చోటు చేసుకుంది. అనంతపురంలోని ఆదర్శనగర్‌కు చెందిన ఖాదర్ (40), అల్లుడు షాబాత్ (12) ఈతకెళ్లి నీట మునిగి మృతి చెందారు. స్థానికులు, బంధువులు తెలిపిన వివరాల మేరకు ఖాదర్ బంధువులతో కలిసి ఉరవకొండలో జరిగిన ఓ శుభకార్యానికి హాజరయ్యారు. అయితే తిరుగు ప్రయాణంలో మార్గమధ్యంలో ఉన్న పెన్నోబిలం ఏటి గంగమ్మ ఆలయం వద్ద నదిలోని గుంతలో ఈతకు వెళ్లారు. ముందుగా గుంతలోకి దిగిన షాబాత్ మునిగిపోయాడు. అల్లుడిని కాపాడేందుకు ప్రయత్నించిన ఖాదర్ సైతం నీటిలో మునిగి మృతి చెందారు.