క్రైమ్/లీగల్

రాఘవాపురం ఆలయంలో విగ్రహాలు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెడ్డిగూడెం, జూన్ 20: రెడ్డిగూడెం శివారు రాఘవాపురం గ్రామంలో వేంచేసి ఉన్న ఆంజనేయస్వామి దేవాలయంలో గల అత్యంత ఖరీదైన దేవతా విగ్రహాలు బుధవారం రాత్రి చోరీకి గురికావటంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు. గతంలో ఇదే దేవాలయంలో ఉన్న వేంకటేశ్వరస్వామి, గరుత్మంతుడు, శ్రీదేవి, భూదేవి విగ్రహాలు కూడా చోరీకి గురికావటడంతో ఆలయ కమిటీ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి చోరీ అయిన విగ్రహాలను నిందితుల నుండి స్వాధీనం చేసుకుని కమిటీ నిర్వాహకులకు అందజేశారు. ఇదిలా ఉండగా కొందరు దుండగులు బుధవారం రాత్రి దేవాలయానికి వేసి ఉన్న రెండు తాళాలను పగులగొట్టి లోపలికి ప్రవేశించి దేవతా విగ్రహాలను చోరీ చేశారు. కాగా గురువారం ఉదయం ఈ సంఘటనపై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా ఎస్సై అనిల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదే దేవాలయంలో రెండోసారి చోరీ జరగడంపై భక్తులు ఆందోళన చెందుతున్నారు.