క్రైమ్/లీగల్

వ్యభిచార స్థావరంపై పోలీసులు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, జూన్ 22: పరువుగల ఉన్నత వర్గాలు నివశించే కాలనీలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచార గృహంపై అమలాపురం పట్టణ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకురాలితో పాటు ఇద్దరు మహిళలు, ఇద్దరు విటులను అధుపులోకి తీసుకుని కేసు నమోదు చేసారు. ఈ సంఘటన శుక్రవారం కాలనీలో తీవ్ర అలజడి రేపింది. రాజకీయ నాయకులు, ఉన్నత ఉద్యోగులు, వ్యాపారవేత్తలు నివసించే ప్రాంతంలో జరుగుతున్న చీకటి వ్యాపార ఉదంతాన్ని పోలీసులు చేధించడంతో కాలనీ వాసులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబందించి పట్టణ సీఐ సీహెచ్ శ్రీరామకోటేశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రావులపాలెంకు చెందిన కంబెల లక్ష్మి అమలాపురం ఎర్రవంతెన సమీపంలో గల హౌసింగ్ బోర్డు కాలనీలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని గత కొంతకాలంగా వివిధ ప్రాంతాలను అమ్మాయిలను తీసుకువచ్చి ఈ వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు తెలిపారు. దీనిని సహించలేని అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన పక్కా సమాచారం మేరకు శుక్రవారం మధ్యాహ్నం ఆ ఇంటిపై దాడులు నిర్వహించామన్నారు. ఈదాడిలో తాడేపల్లిగూడెంకు చెందిన 30 ఏళ్ళ యువతి, మండపేటకు చెందిన 24 ఏళ్ళ యువతితో పాటు ముమ్మిడివరం మండలం ఠాణేలంకకు చెందిన సీహెచ్ వీరాస్వామి, అమలాపురానికి చెందిన వీ రమేష్‌ను అరెస్టు చేసి వారి నుండి రూ. 2 వేలు నగదు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.