క్రైమ్/లీగల్

కోనేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల్లూరు, జూన్ 23:మండల పరిధిలోని లక్ష్మీపురం జగన్నాథగట్టుపై వెలసిన కోనేటిలో శనివారం ప్రమాదవశాత్తూ కాలు జారి కోనేటిలో పడి డిగ్రీ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు.. వెల్దుర్తి గ్రామానికి చెందిన అగ్గిరాముడు కుమారుడు పసుపుల జయాకర్(కృష్ణ) జన్ననాథగట్టుపై వారి బంధువులు పుట్టెంట్రుకలు తీయిస్తుండటంతో అక్కడకి వచ్చారు. అతడి స్నేహితులు కోనేరులో ఈత కొడుతుంటే చూస్తూ కాళ్లు కడుక్కునేందుకు కింది మెట్టుపైకి దిగగా కాలు జారి ప్రమాదవశాత్తూ కోనేటిలో పడి మునిగిపోయాడు. తోటి స్నేహితులు కాపాడే ప్రయత్నం చేసే లోపే నీటిలోకి మునిగిపోయాడు. ఈ విషయంపై ఉలిందకొండ పోలీసులకు సమాచారం అందించడంతో వారు అగ్నిమాపక సిబ్బందితో కలిసి వచ్చారు. అనంతరం గజ ఈతగాళ్లు కోనేటిలో దాదాపు 5గంటల పాటు గాలించి యువకుడి శవాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని శోకసముద్రంలో మునిగిపోయారు. ఇక శవాన్ని పోస్టుమార్టం కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఉలిందకొండ ఎస్‌ఐ శరత్‌కుమార్‌రెడ్డి తెలిపారు.