క్రైమ్/లీగల్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 24 June 2018
నకరికల్లు, జూన్ 24: తెలంగాణా నుండి నరసరావుపేట వైపువెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరు గాయాలపాలైన సంఘటన మండలంలోని దేచవరం సమీపంలో ఆదివారం చోటు చేసుకుంది. నకరికల్లు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణా రాష్ట్రంలోని కొండ్రపోలు గ్రామం నుండి నరసరావుపేటకు మినీ లారీ బయలుదేరింది. ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీ కొనడంతో పాతలోతు నాను (33), నరేష్నాయక్ (33) సంఘటనా స్ధలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలవ్వడంతో చికిత్స నిమిత్తం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ మేరకు ఎస్ఐ అనిల్కుమార్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.