క్రైమ్/లీగల్

ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగిరిపల్లి, జూన్ 29: ఇంజనీరింగ్ విద్యార్థినిపై తోటి విద్యార్థులు అత్యాచారం చేసి, దానిని సెల్‌ఫోన్‌లో వీడియో తీసి బెదిరించిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కృష్ణాజిల్లా ఆగిరిపల్లి మండలం పోతవరప్పాడు ఎన్‌ఆర్‌ఐ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకున్న విద్యార్థినిపై అదే కళాశాలకు చెందిన సీనియర్ విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ దృశ్యాలను చిత్రీకరించి, విద్యార్థినిని బెదిరించారు. ఈ ఘటన గత ఏడాది ఫిబ్రవరిలో జరిగినా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురు విద్యార్థులపై ఆగిరిపల్లి పోలీసు స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని అదే తరగతికి చెందిన వంశీకృష్ణ, శివారెడ్డి పుట్టినరోజు పార్టీ జరుగుతోందని, రావాలని కోరారు. దీంతో ఆ విద్యార్థిని పుట్టిన రోజు పంక్షన్‌కు వెళ్ళింది. అక్కడ కృష్ణవంశీ, శివారెడ్డి మాత్రమే ఉన్నారు. మిగిలిన విద్యార్థులు రాలేదేమని విద్యార్ధిని అడగ్గా వారు వస్తారులే, కూల్ డ్రింక్ తాగమంటూ మత్తుమందు కలిపిన పానీయాన్ని ఇచ్చారు. శీతల పానీయం తాగిన అనంతరం మత్తులో ఉన్న విద్యార్థినిపై ఆ ఇద్దరు విద్యార్థులు అత్యాచారం చేశారు. అత్యాచార సంఘటనలను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. జరిగిన సంఘటనను ఎవరికైనా చెబితే ఈ వీడియోలను బయటపెడతామని బెదిరించారు. దీంతో విదార్థిని భయపడి ఎవరికీ చెప్పకుండా ఉండిపోయింది. ఈ వీడియో ఆలస్యంగా ప్రవీణ్ అనే విద్యార్థికి చేరింది. దీంతో ప్రవీణ్ విద్యార్థినిని వేధించటం ప్రారంభించాడు. తనకు పది లక్షల రూపాయలు ఇవ్వాలని, లేకుంటే దీనిని అందరికీ పంపుతానని బెదిరించాడు. దీంతో భయపడిన విద్యార్థిని జరిగిన ఉదంతాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వెంటనే ఆమె తండ్రి శుక్రవారం ఆగిరిపల్లి పోలీసు స్టేషన్‌లో ముగ్గురు విద్యార్థులపై పిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ ఏసోబు తెలిపారు. సిఐ వైవిఎల్ నాయుడు దర్యాప్తు చేస్తున్నారు.