క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో మామా అల్లుళ్లు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలికిపురం, జూలై 7: మలికిపురం పోలీసు స్టేషన్ పరిధిలోని గుడిమెళ్లంకలో శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురు వ్యక్తులు మృతిచెందారు. పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మణేశ్వరం గ్రామం సవరం ప్రాంతానికి చెందిన కటికిదల సుబ్రహ్మణ్యం (48), దుండి సురేష్ (27) అనే ఇరువురు వ్యక్తులు మోటార్‌సైకిల్‌పై మలికిపురంలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తూ గుడిమెళ్లంకలో ఆటోని తప్పించబోయి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో ఇరువురు వ్యక్తులు అక్కడిక్కడే మృతిచెందారు. ఈ ఇరువురు మామా అల్లుళ్లు కావడం విశేషం. మలికిపురం ఎస్సై ఏ చైతన్యకుమార్, రాజోలు ఎస్సై నాగరాజు ఇరువురు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు ప్రారంభించారు. తమ కుటుంబీకుల మరణ వార్త విని సంఘటన స్థలానికి చేరుకున్న మృతుల కుటుంబ సభ్యులు హృదయవిదారకంగా విలపిస్తున్నారు.