క్రైమ్/లీగల్

మట్టి పెళ్లలు విరిగిపడి కూలీ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, జూలై 8 : మండలంలోని కుణుతూరు గ్రామంలో ఆదివారం మట్టిపెళ్లలు విరిగిపడి ఉపాధికి వెళ్ళే కూలీ ఖాశీంపీరా (43) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తన ఇంటి నిర్మాణం నిమిత్తం కోసం ఇసుక తెచ్చుకునేందుకు కుమారుడితో కలిసి గ్రామ సమీపంలోని వంకలోకి వెళ్ళారు. ఇసుకను తోడుతుండగా ఉన్నపళంగా పైనుండి మట్టిపెళ్లలు ఖాశీంపీరా మీదకు విరిగిపడ్డాయి. దీంతో ఇసుకలోనే కూరుకుపోయిన ఖాశీంపీరా అక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుమారుడు గ్రామంలోకి వచ్చి సమాచారం అందించడంతో గ్రామస్థులు వెళ్ళి పెల్లలు తొలగించి ఖాశీంపీరాను బయటికి తీశారు. అయితే పెల్లల కిందే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. ఎంపీపీ వేణుగోపాల్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్ళి ఖాశీంపీరా కుటుంబానికి ఆర్థికసాయం చేశారు. అనంతరం పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.