క్రైమ్/లీగల్

గర్భం దాల్చిన బాలిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 9: వరుసకు కుమార్తె అయ్యే ఓ అభంశుభం తెలియని బాలిక (14)ను గర్భవతిని చేసి ఆమె జీవితాన్ని నరకప్రాయంగా మార్చిన మారు తండ్రి, అనంతరం ఈ విషయం ఎలాగైనా బయటపడుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. నిజామా బాద్ జిల్లా నవీపేట మండలం మహంతం గ్రామానికి చెందిన సాయిలు (50)కు పాతికేళ్ల క్రితమే వివాహం జరిగింది. అయితే, కుటుంబ కలహాల కారణంగా గడిచిన తొమ్మిది సంవత్సరాల నుండి సాయిలు భార్యా పిల్లలకు దూరంగా ఉంటున్నాడు. తన స్వగ్రామమైన మహంతంను వదిలిపెట్టి వేల్పూర్ మండల కేంద్రానికి వలసవెళ్లి వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ అక్కడే ఉండేవాడు. ఈ క్రమంలోనే తన ఇద్దరు కుమార్తెలతో కాలం వెళ్లదీస్తున్న వేల్పూర్‌కు చెందిన మరో మహిళతో సాయిలుకు పరిచయం ఏర్పడింది. ఆమెకు సైతం మగదిక్కు లేకపోవడంతో సాయిలుతో చనువు పెంచుకుని గత ఏడేళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. అయితే ఆమె రెండవ కుమార్తె (14)పై కనే్నసిన సాయిలు, వరుసకు తనకు కూడా కూతురే అవుతుందనే విచక్షణను మర్చిపోయి చిన్నారిని మాయమాటలతో లోబర్చుకుని తన శారీరక వాంఛను తీర్చుకునేవాడు. ఈ విషయం తాను సహజీవనం చేస్తున్న మహిళకు తెలియకుండా జాగ్రత్తపడేవాడు. అయితే, మైనర్ బాలికకు కడుపు నొప్పి రావడంతో గత నాలుగు రోజుల క్రితం ఆమెను తల్లి ఆసుపత్రికి వైద్యం కోసం తీసుకెళ్లగా, గర్భం దాల్చినట్టు వైద్యులు నిర్దారించారు. ఈ పరిణామంతో హతాశురాలైన బాలిక తల్లి తనతో సహజీవనం చేస్తున్న సాయిలును గట్టిగా నిలదీసింది. అప్పటికే బాలిక కూడా తన పరిస్థితికి సాయిలే కారణమని తల్లితో వాపోయింది. బాలిక గర్భం దాల్చిన విషయం బయటకు పొక్కడంతో భయపడిన సాయిలు గత రెండు రోజుల క్రితమే తన స్వగ్రామమైన మహంతంకు ఆనుకుని ఉండే కమలాపూర్ శివారులో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బాలికను జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా, వారు పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి బాధితురాలిని సదరం హోంకు తరలించారు.