క్రైమ్/లీగల్

వాహనం సహా 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, జూలై 15: మండల పరిధిలోని కృష్ణాపురం వద్ద వాహనంతో పాటు 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. టాస్క్ఫోర్స్ సిబ్బందికి వచ్చిన సమాచారం మేరకు శనివారం అర్ధరాత్రి కృష్ణాపురం గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు. చీకటిగా ఉన్న అటవీ ప్రాంతంలో లైట్లు వెలగడంతో గమనించిన సిబ్బంది ఆ ప్రాంతానికి చేరుకునేలోపే ఎర్రచందనం స్మగ్లర్లు అక్కడ నుంచి వాహనాన్ని వదిలేసి పరారయ్యారని, తమిళనాడు రిజిస్ట్రేషన్ కలిగిన ఫోర్డ్ ఐకాన్ కారులో డిక్కీ వెనుకసీటులో 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నామని టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. పరారైన స్మగ్లర్లకోసం గాలింపుచర్యలు చేపట్టామని వారు చెప్పారు.