క్రైమ్/లీగల్

100 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమదేవరపల్లి, జూలై 15: ముల్కనూరులో 100 క్వింటాల రేషన్ బియ్యాన్ని నాలుగు వాహనాలను సీజ్ చేసి ఏడుగురిని అరెస్ట్ చేసినట్లు ముల్కనూరు ఎస్సై డేగల రమేష్ తెలిపారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో మంగల్‌దుబ్బ వద్ద శ్యాంసుందర్‌రెడ్డి ఇంటి వద్ద రెండు గదులలో నిలువ ఉంచి న 100 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ వారు అందించిన సమాచారంతో రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ముల్కనూరుకి చెందిన మొడం రవి, పత్తిరి తిరుపతి గత కొద్ది కాలం నుండి ముల్కనూరులో రేషన్ బియ్యాన్ని సేకరించి మహారాష్ట్ర అమ్ముతున్నట్లు తెలిసిందని అన్నారు. శనివారం రాత్రి యాద్రా ద్రి జిల్లా భువనగిరి మండలం తరుకలపల్లి గ్రామానికి చెందిన బానోతు సోమ్ల, గుగులోతు రాజు, నరేందర్, భాస్కర్ నాలుగు టాటా ఏసీ వాహనాలలో రేషన్ బియ్యాన్ని ముల్కనూరులోని శ్యాంసుందర్‌రెడ్డి ఇంటికి తరలిస్తుండగా రెడ్ అండ్‌డ్‌గా పట్టుకున్నామని తెలిపారు. పట్టుకున్న రేషన్ బియ్యాన్ని ముల్కనూరులో ఒక రేషన్ దుకాణంలో నిలువ ఉంచినట్లు తెలిపారు.