క్రైమ్/లీగల్

కలెక్టరేట్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 16 : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ప్రకాష్ అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సంచలనం రేపింది. వివరాలు.. నగరంలోని బుధవారపేటకు చెందిన ప్రకాష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో అతడిపై భార్య తల్లిదండ్రులు కిడ్నాప్ కేసు పెట్టారు. అయితే తన భార్యను ఆమె తల్లిదండ్రులే దాచి పెట్టి తనపై కిడ్నాప్ కేసు పెట్టారని, ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించగా వారు ఏమాత్రం సహకరించడం లేదని ప్రకాష్ వాపోయాడు. ఈ విషయంపై సోమవారం ప్రకాష్ ప్రజాదర్బార్‌లో కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చి, ఆ తర్వాత వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. దీంతో స్పందించిన పోలీసులు అతడిని హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా వుందని తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు 3వ పట్టణ పోలీసులు తెలిపారు.