క్రైమ్/లీగల్

కారు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అన్నపురెడ్డిపల్లి, జూలై 16 : మండల పరిధిలోని అబ్బుగూడెం గ్రామంలో కారు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం చోటుచేసుకొంది. గాదె జయబాబు(47) తన భార్య అయిన చంద్రావతి అనారోగ్య కారణాల వల్ల సత్తుపల్లి హాస్పటల్ లో ఉండగా ఉదయం 6 గంటల సమయంలో ద్విచక్రవాహనంపై వెళుతుండగా రాజాపురం గ్రామానికి చెందిన బండి నాగేంద్ర రెడ్డి కొత్తగూడెం వైపు కారులో వెళుతుండగా అబ్బుగూడెం గ్రామంలో మలుపు వద్ద ద్వి చక్ర వాహనాన్ని కారు ఢీ కొట్టింది.దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న జయబాబుకు తలకు తీవ్రమైన గాయమై కాలు విరిగి పోవటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నట్లు గ్రామస్తులు తెలియజేశారు.
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కూసుమంచి, జూలై 16: స్థానిక మసీదుసెంటర్‌లో విద్యుత్‌షాక్ తగిలి మహిళ మృతి చెందింది. గ్రామస్థుల కధనం ప్రకారం షేక్ జయితిన్ (60) అనే ముస్లీం మహిళ ఇంట్లో విద్యుత్ షాక్ తగలడంతో అక్కడిక్కడే మృతి చెందింది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంటి ప్రాంగణమంతా తడిచి ఉండటంతో విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందింది. మృతురాలుకి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
సంఘటన స్దలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..