క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఒకని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామూరు, జూలై 16: ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని మినీ లారీ ఢీకొనడంతో 20 అడుగుల లోతులో గల చప్టా నుంచి కిందపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన సోమవారం పామూరు పంచాయతీ పరిధిలో జరిగింది. ఈ సంఘటనలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెద్దిరెడ్డిపల్లికి చెందిన టి ఖాజామస్తాన్ (32) అక్కడికక్కడే మృతిచెందాడు. ఖాజామస్తాన్‌కు ఇద్దరు ఆడపిల్లలు, భార్య ఉన్నారు. పామూరులోని చైతన్య స్కూల్‌లో పిల్లలను చేర్పించి గోపాలపురం వద్ద రైస్ మిల్లు నుంచి బియ్యం తీసుకుని వస్తుండగా కడప నుంచి కనిగిరి వెళ్తున్న మినీ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఖాజామస్తాన్ అక్కడిక్కడే మృతిచెందాడు. ఖాజామస్తాన్ బంధువులు పామూరులోనే ఉండడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని అతని మృతదేహం వద్ద బోరున విలపించారు. విషయం తెలుసుకున్న సిఐ ఎం మధుబాబు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.