క్రైమ్/లీగల్

ఆటో బోల్తా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిరిసిల్ల, జూలై 15: సిరిసిల్ల పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు ప్యాసింజర్ ఆటో బోల్తా పడి 11 మంది గాయాలపాలయ్యారు. సిరిసిల్ల పట్టణంలోని పద్మానగర్ ప్రాంతానికి చెందిన జక్కని మల్లేశం కుటుంబం మొక్కు తీర్చుకోవడానికి, అలాగే చిన్నారి 21వ రోజు ఎల్లమ్మ ఆలయం వద్ద జరుపుకోడాకి తంగళ్ళపల్లి మండలం మండెపల్లి ఎల్లమ్మ ఆలయానికి వెళుతుండగా ఆదివారం ఈ ఘటన జరిగింది. గాయాలకు గురైన వారిని సిరిసిల్ల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స చేశారు. ఇందులో ముగ్గురు చిన్నారులు ఉండగా వారికి కూడా గాయాలయ్యాయి. కొందరిని కరీంనగర్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించినట్టు తెలిపారు. కాగా వీరిని తీసుకెలుతున్న ప్యాసింజర్ ఆటో నెమ్మదిగానె వెలుతుండగా, సిరిసిల్ల పోలీస్ స్టేషన్, అర్బన్ బ్యాంకు సమీపంలో వెనక నుండి వేగంగా దూసుకువచ్చిన కారు ఆటోను ఓవర్ టేక్ చేయడంతో కుడి వైపు తిప్పిన ఆటో అదుపు తప్తి బోల్తా పడినట్టు తెలిసింది. అయితే నెమ్మదిగా వెలుతున్న తమ ఆటోను వెనుక నుండి దూసుకవచ్చిన కారు ఆటోకు స్వల్పంగా ఢీకొట్టి వెల్లడంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడినట్టు బాధిత మహిళలలు తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు 108 వాహనంలో ఆసుపత్రిలో తరలించారు. బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.