క్రైమ్/లీగల్

71 మంది వాహన చోదకులకు జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 20: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 71 మంది వాహన చోదకులకు కోర్టు జైలు శిక్ష విధించినట్లు ఒంగోలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ డిఎస్‌పి వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడిపిన కేసులో మొత్తం 73వేల 600 రూపాయలు కోర్టు వారు జరిమానాగా విధించినట్లు డిఎస్‌పి తెలిపారు. ప్రకాశం జిల్లావాసుల్లో కొందరు మద్యం సేవించి వాహనాలను నడిపి ప్రమాదాలు పాలవుతున్నట్లు డిఎస్‌పి తెలిపారు. దీని వలన జరిగే ప్రాణ, వ్యక్తిగత, ఆస్తినష్టాలను అరికట్టాలన్న ఉద్దేశ్యంతో ఎస్‌పి బి సత్యఏసుబాబు ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా పోలీసు అధికారులు వారి వారి ఇలాకాలోని ప్రదేశాల్లో ఈనెల 13 నుండి 20 వరకు వాహన చోదకులకు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తనిఖీలు నిర్వహించినట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ తనిఖీల్లో మొత్తం 351 మందిని మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిగా గుర్తించి వారిపై ఎంవి యాక్ట్ సెక్షన్ 185 (ఎ) ప్రకారం కేసులు నమోదు చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. వారిలో 97 మందిని కోర్టులో హాజరుపరచగా, 71 మంది వాహన చోదకులకు జైలుశిక్ష, మిగిలిన వారికి జరిమానా విధించినట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మొత్తం 73వేల 600 రూపాయలు కోర్టు వారు జరిమానాగా విధించినట్లు డిఎస్‌పి వేణుగోపాల్ తెలిపారు.