క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెళుగుప్ప, జూలై 20 : మండల పరిధిలోని వెంకటాద్రిపల్లి గ్రామానికి చెందిన రైతు చల్లా అశోక్ (28) గురువారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంకటాద్రిపల్లికి చెందిన చల్లా రంగనాయకులు కుమారుడు అశోక్ తనకున్న ఏడెకరాల పొలంలో పంటలు సాగుచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అయితే నాలుగైదు సంవత్సరాలుగా సకాలంలో వర్షాలు రాకపోవడంతో పంటలు పండలేక, చేసిన అప్పులు తీర్చలేక కుటుంబ పోషణ భారమైంది. ఈనేపథ్యంలో మనస్థాపానికి గురై గురువారం రాత్రి ఇంటికి సమీపంలోని పొలంలో పురుగుల మందుతాగి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు గమనించారు. అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కుతుళ్లు ఉన్నారన్నారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాగస్వామి తెలిపారు.