క్రైమ్/లీగల్

120 కిలోల గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజవొమ్మంగి, జూలై 20: రాజవొమ్మంగి మండలం చెరుకుంపాలెం సమీపంలో శుక్రవారం పోలీసులు రెండున్నర లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకుని ఇరువురిని అరెస్టు చేశారు. సీఐ పి వెంకట త్రినాథ్ తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా దారకొండ ఏజెన్సీ ప్రాంతం నుంచి హైదరాబాద్‌కు చెందిన జి పరమేష్, ఖమ్మంనకు చెందిన ఎం అశోక్‌లు ఎర్తిగా కారులో 120 కిలోల ఎండు గంజాయిని డిక్కీలో వేసుకుని తరలిస్తుండగా చెరుకుంపాలెం గ్రామశివార్ల వద్ద పోలీసులకు పట్టుబడ్డారు. నిందితుల నుంచి వెయ్యి రూపాయల నగదు, మూడు సెల్‌ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జడ్డంగి పశువైద్యాధికారి చైతన్య, వీఆర్వో ఎ విజయకుమారి సమక్షంలో వీటిని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రంపచోడవరం కోర్టులో హాజరుపర్చగా రిమాండు విధించారని సీఐ తెలిపారు. ఈదాడిలో జడ్డంగి ఎస్సై పిజిఎన్ ప్రసాద్, హెచ్‌సీ రామకృష్ణ, పీసీ వరహాలు, సాయి తదితరులు పాల్గొన్నారు.