క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో.. సివిల్స్‌కు సిద్ధం అవుతున్న యువకుడి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కల చెదిరింది
కన్నీరే.. మిగిలింది
ఆంధ్రా నుంచి అమీర్‌పేట కోచింగ్ సెంటర్‌లో సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అయ కలెక్టర్ అవుదామని
కల కన్నాడా యువకుడు. హైదరాబాద్ లో చదివి తన కల సాకారం చేసుకుందామని ఆశయంగా
పెట్టుకున్నాడు. ఈలోపు మిత్రుని జన్మదినోత్సవ వేడుకల్లో మద్యం సేవించి అతి వేగంగా వాహనం
నడపడంతో జీవిత కథపరిసమాప్తమైంది. కన్నకొడుకు
కలెక్టరవుతాడనుకున్న తల్లిదండ్రులకు కన్నీరు మిగిలింది.
*
హైదరాబాద్, జూలై 22: రోడ్డు ప్రమాదంలో సివిల్స్‌కు సిద్ధం అవుతున్న యువకుడి మృతిచెందిన సంఘటన పంజాగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదారి జిల్లాకు చెందిన మహంత్ కుమార్(25) అమీర్‌పేటలోని ఓ హాస్టల్‌లో ఉంటూ సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. తన స్నేహితుడు వేణు పుట్టినరోజు కావడంతో శనివారం మరో స్నేహితుడు నిఖిల్‌ను తీసుకొని బేగంపేటకు వెళ్లాడు. అర్ధరాత్రి వేడుకలు జరుపుకున్న అనంతరం తిరిగి హాస్టల్‌కు వెళ్తుండగా అమీర్‌పేట లాల్‌బంగ్లా వద్ద ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మహంత్ కుమార్ అక్కడికక్కడే మృతిచెందగా, నిఖిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు చేరుకొని గాయాలతో బాధపడుతున్న నిఖిల్‌ను ఆసుత్రికి తరలించారు. స్నేహితుడి జన్మదిన వేడుకల్లో మద్యం సేవించడంతో పాటు అతివేగంగా వాహనాన్ని నడపడంతో ప్రమాదం జరిగినట్టు పోలీసులు గుర్తించారు. పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.