క్రైమ్/లీగల్
ఆరుగురు సీనియర్ న్యాయవాదులతో ప్యానెల్ ఏర్పాటు చేయండి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 February 2018
హైదరాబాద్, ఫిబ్రవరి 22: విశాఖపట్నం ఏజన్సీ వాకపల్లి గ్యాంగ్రేప్ ఘటనలో విచారణ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించే విషయమై ఆరుగురు సీనియర న్యాయవాదులతో కూడిన ప్యానెల్ను ఏర్పాటు చేయాలని రిజిస్ట్రార్ జనరల్ను హైకోర్టు ఆదేశించింది. ఏపి నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ముగ్గురు న్యాయవాదులతో ప్యానెల్ను ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఇందులో నుంచి ఒక న్యాయవాదిని ఎంపిక చేసి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నియమించవచ్చని హైకోర్టు పేర్కొంది. జస్టిస్ సివి నాగార్జునరెడ్డి, జస్టిస్ జి శ్యాంప్రసాద్తోకూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం ఈ కేసును హైకోర్టు వారం రోజుల పాటు వాయిదా వేసింది.