క్రైమ్/లీగల్

వ్యక్తిగత కక్షతో వృద్ధురాలి ఇల్లు కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూసుమంచి, జూలై 31: వృద్ధురాలి దగ్గర ఉన్న డబ్బులు ఇవ్వలేదని కుమారుడి కొడుకు ఇల్లు తగలబెట్టిన ఘటన మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలో చోటు చేసుకుంది. బాధితురాలి కధనం ప్రకారం ముద్రబోయిన లక్ష్మికి ముగ్గురు కుమారులు వున్నా వారెవ్వరూ ఆమె బాగోగులు చూసుకోకపోవడంతో వృద్ధ దంపతులు ఇద్దరు అదే వీధిలో ఒక గుడిసెలో నివాసం ఉంటున్నారు. గత కొంత కాలం క్రింద వారికి ఉన్న భూమి ఎన్‌ఎస్‌పి కాలువకు పోగా వారికి ప్రభుత్వం నుండి నష్టపరిహరంగా డబ్బు వచ్చింది. దీనితో వారి ఇంటికి ఎదురుగా నివసిస్తున్న వారి రెండవ కొడుకు కోడలు, మనువడు వృద్ధ దంపతులను తరచు డబ్బులు ఇవ్వమని వేధిస్తున్నారు. డబ్బు ఇవ్వకపోవడంతో తమపై కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో సొమవారం నాడు ఉదయం వచ్చి డబ్బులు ఇవ్వాలని తన మనువడైన శ్రీకాంత్ గొడవపెట్టుకున్నాడని తాము ఇవ్వకపోవడంతో తమని చంపుతానని బెదిరించి వెళ్ళాడని, అదే రొజు రాత్రి వచ్చి తాము నిద్రిస్తున్న సమయంలో రాత్రి 12గంటల ప్రాంతంలో ఇంటిమీద పెట్రోలు పోసి నిప్పుంటించాడని బాధితురాలు తెలిపింది. ఆసమయంలో పెట్రోలు వాసన వచ్చి మేల్కొన్న ఆమె బయటకు పరుగు తీసి తన ప్రాణాన్ని కాపాడుకుంది. ఈ మంటలలోరూ. 35 వేల రుపాయలు, సుమారు 70కోళ్ళు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితురాలు ఫిర్యాదు మేరకు సంఘటనా స్తలాన్ని పరిశీలించిన పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.