క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో సీఐ, కానిస్టేబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఫిబ్రవరి 22: ఓ కేసులో నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ. 30 వేలు లంచం తీసుకుంటుండగా సీఐ, కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులకు చిక్కారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేటకు చెందిన కే రాజశేఖర్ అనే వ్యక్తిపై నల్లపాడు పోలీసు స్టేషన్‌లో 562/17 కింద కిమినల్ కేసు నమోదైంది. ఈ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు సీఐ కే శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ శేషు నిందితుడి నుంచి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం రాత్రి సీఐ, కానిస్టేబుల్‌లు డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించి పట్టుకున్నారు. వారి వద్ద నుండి నగదును స్వాధీనం చేసుకున్నారు.