క్రైమ్/లీగల్

వివాహేతర సంబంధానికి అడ్డొస్తోందని.. చెట్టుకు కట్టి.. కిరోసిన్ పోసి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్వతగిరి, ఆగస్టు 5: వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ వ్యక్తి భార్య అడ్డుగా ఉందని చెట్టుకు కట్టేసి కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన ఘటన వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని పర్వతగిరి మండలం ఏనుగల్ శివారులోని సూర్యతండాలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఎసీపీ శోభన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతగిరి మండలం ఏనుగల్ శివారులోని సూర్యతండాకు చెందని బానోతు బాలు గత కొంతకాలం నుంచి వివాహేతర సంబందాన్ని కొనసాగిస్తూ తన కుటుంబాన్ని పట్టించుకోకుండా ఉండేవాడు. ఈ విషయంలో భార్య బానోతు రజిత (30) పలుమార్లు భర్తను నిలదీసింది. ప్రతి రోజు కుటుంబంలో అక్రమ సంబంధం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం అర్ధరాత్రి తన భర్త ఇంట్లో లేకపోవడంతో బాలు భార్య రజిత వెతుకుతూ అనుమానంతో అక్రమ సం బంధం పెట్టుకున్న మహిళ ఇంటికి వెళ్లి చూడగా భర్త ఆ ఇంట్లో ఉండడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో కోపోద్రిక్తుడైన భర్త రజితను ఇంటి పక్కన ఉన్న చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టి కిరోసిన్ పోసి నిప్పు అంటించాడు. దీంతో రజిత అరవడంతో చుట్టపక్కల ఉన్న వారు రజిత అరుపులు విని వచ్చి చూసే సరికి దాదాపు 60 శాతం కాలిపోయిం ది. ఆమెను హుటాహుటిన వరంగల్ ఎంజీయం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం రజిత మృతిచెందినట్లు తెలిపారు. బాధితురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తునట్లు ఎసీపీ తెలిపారు. నిందితుడు బాలు, అక్రమ సంబంధం ఉన్న మహిళ వినోద పరారీలో ఉన్నట్లు ఏసీపీ శోభన్‌కుమార్ తెలిపారు. రజితకు ఇద్దరు కుమారులు ఉన్నారు. రజి త మృతితో సూర్యతండాలో విషాదం నెలకొంది.