క్రైమ్/లీగల్

ఏడాది పాపను స్టేషన్‌లో వదిలేసి ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తూప్రాన్, ఫిబ్రవరి 22: ఏడాది వయస్సున్న కూతురిని వదిలి ఒక జంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌లో జరిగింది. పోలీసులు తెలి పిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పద్మాజివాడకు చెందిన ఒంటెద్దు కాశీరాం (38) తన తమ్ముడు దుబాయికి వెళ్లడంతో తమ్ముడి భార్య దేవేంద్ర (32)తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.
కాశీరాంకు గతంలో రెండు పెళ్లిళ్లు చేసుకుని వదిలేశాడు. దేవేంద్రకు ఉన్న కుమారుడిని హాస్టల్‌లో చదివిస్తున్నారు. ఇటీవల దేవేంద్ర తన భర్త వద్దకు వెళ్తానని చెప్పడంతో వీరిద్దరూ ఘర్షణపడ్డా రు. ఉంటే కలిసే ఉందాం, లేకుంటే ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. బుధవారం రాత్రి కామారెడ్డిలో రైలెక్కి బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌లో దిగారు. అనుమానం వచ్చిన గ్రామస్తులు వీరిని అడుగగా విందుకు మేడ్చల్ వెళ్తున్నామని తెలియక ఇక్కడ దిగామని దొంతిలో బంధువులున్నారని వారి వద్దకు వెళ్తున్న ట్టు చెప్పారు. గురువారం తెల్లవారుజామున కూతురిని బ్రాహ్మణపల్లి రైల్వేస్టేషన్‌లో వదిలి వీరిద్దరూ స్టేషన్‌కు సమీపంలో రైలు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. శవాలు గుర్తుపట్టరాకుండా ఉన్నాయి. పాప వద్ద గల బ్యాగ్‌లో కాశీరాం ఆధార్‌కార్డు ద్వారా తూప్రాన్ ఎస్‌ఐ నాగార్జునగౌడ్ పద్మాజీవాడ పోలీసులకు సమాచారమివ్వడంతో కుటుంబీకుల వివరాలు తెలిసాయి. కామారెడ్డి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారి పాపను పోలీసులు తూప్రాన్ ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం పాపను కుటుంబీకులకు అప్పగిస్తామని లేనిచో శిశువిహార్‌కు అప్పగించనున్నట్టు తెలిపారు.

చిత్రాలు..దేవేంద్ర, కాశీరాంల (ఫైల్ ఫొటో) *దేవేంద్ర కూతురు