క్రైమ్/లీగల్
రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 12 August 2018
జలుమూరు, ఆగస్టు 12: మండలం తిలారు రైల్వే స్టేషన్ సమీపంలో రైలుపట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పలాస రైల్వేపోలీసులు ఆదివారం గుర్తించారు. శనివారం సాయంత్రం విశాఖనుండి పలాస వైపు వెళ్తున్న గూడ్సు రైలు కింద పడి మరణించివుంటాడని రైల్వే పోలీసుల అభిప్రాయం. తెల్లవారికి మరుగుదొడ్లుకు వెళ్లి మృతదేహం చూసినవారు మరణించిన వ్యక్తి రైలుపై గాయపరిచి కిందకు తోసివేసినట్లు అనుకొంటున్నారు. మృతుడు వయస్సు 35సంవత్సరాలుంటుందని పోలీసుల అంచనా. మృతుడుకు నీలం జీన్ఫ్యాంట్, గీతలు టీషర్ట్ ధరించివున్నాడని పోలీసులు తెలిపారు. మనిషి మద్యగా కట్ అవ్వడం చూపరులు భయపడ్డారు. సమాచారం తెల్సుకున్న పలాస రైల్వేపోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు.