క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో ఇద్దరు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దిపాడు, ఆగస్టు 12 : జాతీయ రహదారిపై గుండ్లాపల్లి వద్ద గల భారత్ పెట్రోల్ బంకు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం రాజమండ్రికి సమీపంలోని కొవ్వూరు నుండి నెల్లూరు వైపు రొయ్యల మేతతో వెళుతున్న లారీ ఘటనా స్థలంలో ముందు వెళుతున్న లారీని ఢీ కొట్టడం జరిగింది. దీంతో లారీ క్యాబిన్ పూర్తిగా ధ్వంసమై లారీలో ఉన్న డ్రైవర్, క్లీనర్ క్యాబిన్‌లో చిక్కుకొని మృతి చెందారు. మృతదేహాలను బయటకు తీయడానికి హైవే పెట్రోలింగ్ సిబ్బందితో పాటు స్థానిక పోలీసులు గంటకు పైగా కష్టపడి మృత దేహాలను బయటకు తీశారు. మృతి చెందిన వారిలో డ్రైవర్ కె రఘరామయ్య (50) నెల్లూరు సమీపంలోని భువనపల్లి గ్రామానికి చెందిన వారు. క్లీనర్ రాహుల్ (34) నెల్లూరు సమీపంలోని మామిడిగుంట గ్రామానికి చెందిన వారు. ఘటనా స్థలాన్ని ఒంగోలు డిఎస్‌పి శ్రీనివాసరావు, ఒంగోలు రూరల్ సీఐ మురళీకృష్ణ, స్థానిక ఎస్‌ఐ సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పంచనామా నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
ఉరివేసుకుని ఇటుకబట్టీ కార్మికుడు ఆత్మహత్య
అద్దంకి, ఆగస్టు 12 : అద్దంకి పట్టణం కలవకూరురోడ్డులో ఇటుకబట్టీల్లో పనిచేసే కార్మికుడు కోట్ల ఆదేశ్(40) ఆదివారం ఉదయం ఉరివేసుకొని బలవన్మరణం చెందాడు. దొనకొండ మండలం మల్కాబ్‌పేటకు చెందిన ఆదేశ్ అద్దంకి ఇటుకబట్టీల్లో పనిచేస్తూ, ఇటుకబట్టీలవద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎస్సై సుబ్బరాజు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి, మృతుని బంధువులకు సమాచారం అందించారు. ఆదేశ్ మృతిపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.