క్రైమ్/లీగల్

విద్యార్థి దారుణ హత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం రూరల్, ఆగస్టు 13: గత రెండు రోజుల క్రితం అదృశ్యమైన విద్యార్థి దారుణ హత్యకు గురైన సంఘటన మండల పరిధిలోని కొటిపిలో చోటు చేసుకొంది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. కొటిపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్న నవీన్‌కుమార్ (13) అనే విద్యార్థి గత శుక్రవారం సాయంత్రం అదృశ్యమయ్యాడు. ఈమేరకు విద్యార్థి తల్లిదండ్రులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే అదృశ్యమైన నవీన్‌కుమార్ సోమవారం గ్రామ సమీపంలోని పొలాల్లో శవమై కనిపించాడు. నవీన్‌కుమార్ తల, వీపుపై ఆయుధాలతో నరికినట్లు గుర్తులు ఉన్నాయి. హత్య చేసిన అనంతరం మృతదేహంపై పెట్రోలు పోసి నిప్పంటించినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శేఖర్ సంఘటనా స్థలాన్ని చేరుకొని పరిశీలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు సంబంధించి ఆచూకీ కోసం అనంతపురం నుండి డాగ్ స్క్వాడ్‌ను పిలిపించారు. హత్యకు గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. తమ ఏకైన కుమారుడిని ఎవరు, ఎందుకు హత్య చేశారో అర్థం కావడం లేదని తల్లిదండ్రులు బోరున విలపించారు. కుమారుడి దారుణ హత్యకు గురైన సంఘటన చూసిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు వర్ణణాతీతం.